గాంధీ వర్ధంతి నాడు గాడ్సేకి నివాళులు అర్పించిన హిందూ మహాసభ
- గాంధీని హత్య చేసిన గాడ్సే
- గాడ్సేకి సహకారం అందించిన ఆప్టే
- 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టే అరెస్ట్
- నిరసన తెలుపుతున్నామన్న హిందూ మహాసభ నేతలు
దీనిపై హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, జనవరి 30వ తేదీని తాము గాడ్సే-ఆప్టే స్మృతి దివస్ గా జరుపుకుంటున్నామని వెల్లడించారు. 1948 జనవరి 30న వారిద్దరిని అరెస్ట్ చేశారని, అందుకు నిరసనగా తాము స్మృతి దివస్ ను పాటిస్తున్నామని తెలిపారు.
అంతేకాదు, హిందూ మహాసభ సందర్భంగా 'గాడ్సే-ఆప్టే భారతరత్న' పేరిట కొత్త అవార్డుకు కూడా నాంది పలికింది. గత డిసెంబరులో మహాత్ముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జైలుపాలైన ఆధ్యాత్మిక నేత కాళీచరణ్ మహారాజ్, మరో నలుగురు నేతలను ఈ 'గాడ్సే-ఆప్టే భారతరత్న' అవార్డుతో సత్కరించినట్టు జైవీర్ భరద్వాజ్ ప్రకటించారు.