Andhra Pradesh: ఏపీలో మరోసారి 4 వేలకు పైగా కరోనా కేసులు

AP Covid Daily Report and Statistics
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కొన్నిరోజుల వ్యవధిలోనే కరోనా రోజువారీ కేసుల సంఖ్య అధికమైంది. తాజాగా మరోసారి 4 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,882 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు గుర్తించారు. అదే సమయంలో 696 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 21,10,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,65,696 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 14,510 మంది కరోనాతో మరణించారు.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Daily Report
Today Cases

More Telugu News