YS Sharmila: వాళ్ల మెడలు మీరు వంచుతారా? ఎందుకు ఈ డ్రామాలు?: కేసీఆర్ పై షర్మిల ఫైర్

  • రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది
  • చివరి గింజ వరకు కొంటానన్న ఊసే లేకుండా పోయింది
  • కేంద్రం మెడలు వంచుతామంటే మేము నమ్మాలా?
Sharmila fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయిందని ఆమె విమర్శించారు. చివరి గింజ వరకు కొంటానన్న ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పెట్టుబడి రాక రైతులు చస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీరు అన్నారని... రైతుల మీద మీకు ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారూ అని ఎద్దేవా చేశారు.

కేంద్రం మెడలు వంచుతానంటే నమ్మాలా? అని షర్మిల ప్రశ్నించారు. మొన్నటి వరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకున్నారన్న వాళ్ల మెడలు ఈరోజు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు? అని ప్రశించారు. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇది ఒక భాగమే తప్ప, మీకు రైతుల మీద ప్రేమ లేదని అన్నారు. రైతుల చావుల మీద మీకు సోయి లేదని దుయ్యబట్టారు.

More Telugu News