ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్
- కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్
- జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్
- వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి
- జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ
ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు.