బెంబేలెత్తిస్తున్న కరోనా కేసులు... రేపటి నుంచి బెంగాల్ లో విద్యాసంస్థల మూసివేత
- దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు
- తాజా మార్గదర్శకాలు జారీ చేసిన బెంగాల్
- రేపటి నుంచి అమలు
లోకల్ రైళ్లు 50 శాతం సీటింగ్ తో నడపాలని తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత లోకల్ రైళ్లు నిలిపివేయనున్నారు. అంతేకాదు, కోల్ కతా నుంచి ఢిల్లీ, ముంబయి నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు పరిమితం చేశారు. అది కూడా సోమ, మంగళ వారాల్లోనే విమాన సర్వీసులు నడపనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ విధించారు.
రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు 50 శాతం సీటింగ్ తోనే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక సభలు సమావేశాలకు 200 మందికి లేదా, హాలులో సగం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి ఇవ్వరు.
కోల్ కతాలో గత మూడు రోజుల వ్యవధిలో కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. అటు బెంగాల్ లో కరోనా పాజిటివిటీ రేటు సైతం 5.47 శాతానికి పెరిగింది.