రాజమండ్రిలో ఈరోజు సినిమా థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ
- ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా టికెట్ల వ్యవహారం
- ఇప్పటికే 50కి పైగా థియేటర్ల సీజ్
- కీలక నిర్ణయాలు తీసుకోనున్న యాజమాన్యాలు,
ఈ క్రమంలో ఈరోజు రాజమండ్రిలో సినిమా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరలు వసూళ్లపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు ఈరోజు మరోసారి విచారణ చేపట్టనుంది. ఇదిలావుంచితే, టికెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.