తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ!
- తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
- రాజన్న సరిసిల్ల జిల్లాలో కేసు నిర్ధారణ
- దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్
ఈ నెల 16న సదరు వ్యక్తి దుబాయ్ నుంచి గూడెంకు వచ్చాడు. దుబాయ్ ఎయిర్ పోర్టులోను, హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనూ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అయితే రెండు చోట్లా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల కోసం పంపిన నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులతో కలిపి మొత్తం 13 మందిని వైద్యాధికారులు క్వారంటైన్ చేశారు.