బంగ్లాదేశ్లో భారత రాష్ట్రపతికి సైన్యం ఘన స్వాగతం.. వీడియో ఇదిగో
- బంగ్లాదేశ్లో కోవింద్ 3 రోజుల పర్యటన
- సైనికుల గౌరవ వందనం
- ఢాకాలో బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకలు
- 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ విజయం
కాగా, భారత్, బంగ్లాదేశ్ ల మధ్య 50 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ బలగాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలైన అనంతరం భారత రాష్ట్రపతి చేపడుతోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో కోవింద్ పాల్గొంటారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ తోనూ ఆయన భేటీ అవుతారు.