మద్యం మత్తులో వేగంగా డ్రైవింగ్.. మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు
- చనిపోయిన వారి స్వస్థలం విజయవాడ, ఏలూరు
యువకులంతా హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను చరణ్, సంజూ, గణేశ్ లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని అశోక్ గా గుర్తించారు. చరణ్ ది విజయవాడ, సంజూ, గణేశ్ లది ఏలూరు. ప్రమాదం జరిగినప్పుడు చరణ్ కారు నడిపాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం, అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. కారులోని నలుగురూ మద్యం తాగారన్నారు.