దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడి కన్నుమూత
- 13 ఏళ్ల పసిప్రాయంలోనే విముక్తి పోరాటంలోకి
- 18 ఏళ్లపాటు జైలు జీవితం
- ‘కామ్రేడ్ ఏబీ’ మరణంతో విషాదంలో దేశప్రజలు
- నెల్సన్ మండేలా హయాంలో మంత్రిగా పనిచేసిన ఇస్మాయిల్
దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఇస్మాయిల్ తండ్రి రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో 13 ఏళ్ల పసిప్రాయంలోనే ఇస్మాయిల్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. దిగ్గజ నేతలైన నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రడాలతో కలిసి రాబెన్ ద్వీపంలో ఏళ్ల తరబడి ఇస్మాయిల్ జైలు జీవితాన్ని గడిపారు.
అలా ఆయన తన జీవితంలో 18 సంవత్సరాలు జైలులోనే ఉన్నారు. ఖైదీగా ఉంటూనే రెండు యూనివర్సిటీ డిగ్రీలు సంపాదించారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని ఇస్మాయిల్ పలుమార్లు చెప్పారు. కాగా, నెల్సన్ మండేలా అధ్యక్షుడయ్యాక ఇస్మాయిల్ విదేశాంగశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. దేశప్రజలు ఆయనను కామ్రేడ్ ఏబీగా పిలుచుకునేవారు.