వరద బాధితుల పరామర్శకు మంత్రి మేకపాటి.. ఇప్పుడు తీరిందా? అంటూ బాధితుల నిలదీత
- సంగం మండలం కోలగట్లలో బాధితులను పరామర్శించిన మంత్రి
- మంత్రిని చూడగానే బాధతో నిలదీత
- అండగా ఉంటామని మంత్రి హామీ
బతకుతామో, లేదో తెలీని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపామని, తీరిగ్గా ఇప్పుడా వచ్చేది? అని నిలదీశారు. వరద ముంచెత్తడంతో నడుములోతు నీళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తిండిలేక నానా పాట్లు పడ్డామన్నారు. అయితే, వారిని అనునయించిన మంత్రి మేకపాటి ప్రభుత్వం తరపున వీలైనంత సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.