Andhra Pradesh: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

Depression  Crossed between Chennai and Puducherry Coast this Morning
  • తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో తీరం దాటిన వాయుగుండం
  • చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం
  • అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ విపత్తుల నిర్వాహణ శాఖ కమిషనర్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ తెల్లవారుజామున 3-4 సమయంలో పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

మరోవైపు, వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. జలాశయాలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Andhra Pradesh
Heavy Rains
Chennai
Puducherry

More Telugu News