తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు.. ఎంతంటే!
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
- కిలోమీటరుకు ఆర్డినరీ బస్సుల్లో 25 పైసలు, ఎక్స్ ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసల పెంపు
- సీఎం కేసీఆర్ ఓకే అంటే త్వరలోనే అమలు
పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులు, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ లలో కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆయన ఓకే అన్న తర్వాత చార్జీలను పెంచనున్నారు.