రైతులను కారుతో తొక్కించిన చరిత్ర బీజేపీది: హరీశ్ రావు
- హుజూరాబాద్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక
- ముగిసిన ప్రచారం
- మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు
- సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని ధీమా
విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూడడం బీజేపీ నైజం అని అన్నారు. నిరసనలు తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారుతో దూసుకెళ్లి వారి మరణానికి కారకుడయ్యాడని, అతడిపై ఇప్పటికీ చర్యలు లేవని హరీశ్ రావు ఆరోపించారు. రైతులను కారుతో తొక్కించిన చరిత్ర ఎవరిది? బీజేపీది కాదా? అని ప్రశ్నించారు.