అమెరికాలో మళ్లీ కాల్పులు.. తోటి విద్యార్థులపై తుపాకి ఎక్కుపెట్టిన విద్యార్థి
- టెక్సాస్ అర్లింగ్టన్లోని టింబర్ వ్యూ పాఠశాలలో ఘటన
- కాల్పులు జరిపిన 18 ఏళ్ల తిమోతీ
- ఒకరి పరిస్థితి విషమం
- నిందితుడిపై మూడు అభియోగాలు మోపిన పోలీసులు
సమాచారమందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని తిమోతీ జార్జ్ సింప్కిన్స్గా గుర్తించారు. అతడిపై మూడు అభియోగాలు నమోదు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.