లఖింపూర్ ఖేరి ఘటన.. రైతులపైకి కారు ఎక్కిస్తున్న వీడియోలు ఇవిగో
- ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రియాంకగాంధీ
- కారు ఎక్కించిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న
- మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ
ఇదిగో సాక్ష్యమంటూ రైతులపైకి కారు ఎక్కించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఎఫ్ఐఆర్, ఆదేశాలు లేకుండా తనను 28 గంటలుగా నిర్బంధించారని, మరి, రైతులపైకి కారు ఎక్కించిన వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మోదీజీ? అని ప్రశ్నించారు.
ఇక ఈ విషయంలో ప్రియాంకకు ఆమె సోదురుడు రాహుల్ కూడా మద్దతుగా నిలిచారు. ‘‘మీరు నిర్బంధించిన వ్యక్తి ఎవరికీ భయపడదు. నిజమైన కాంగ్రెస్ వాదులు ఓటమిని ఒప్పుకోరు.. ఈ సత్యాగ్రహం ఆగదు’’ అని ట్వీట్ చేశారు.