కేసీఆర్ బంద్ లో పాల్గొనకుండా, మోదీతో విందు చేసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Fires On CM KCR and PM Modi
  • ప్రధాని ఏం మాయ చేశారోగానీ.. సీఎం పూర్తిగా మారిపోయారు   
  • రైతు చట్టాలకు మద్దతిచ్చి ఇప్పుడేమో మాట్లాడట్లేదు
  • మోదీ, కేసీఆర్ పాలనలో పేదల బతుకులు దుర్భరం
  • భారత్ బంద్ నిరసనల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్
రైతుల ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిర్వహించిన బంద్ లలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిశాకే కేసీఆర్ లో మార్పు వచ్చిందన్నారు. ప్రధాని ఏం మాయ చేశారోగానీ.. సీఎం పూర్తిగా మారారని చెప్పారు. భారత్ బంద్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ డిపో ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు.

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు. ఇవాళ్టి బంద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా, మోదీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలు రైతులకు మరణ శాసనాలేనని, వాటితో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగును అదానీ, అంబానీలకు మోదీ తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు.
Go Back to Shorts
Congress
Telangana
Revanth Reddy
TPCC President

More Telugu News