పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా కడియం సీఐ.. వీఆర్‌కు పంపిన అధికారులు

DIG sentKadiam CI Sridhar Kumar To VR
  • రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఘటన
  • తీవ్రంగా పరిగణించిన డీఐజీ కార్యాలయం
  • కడియం ఇన్‌చార్జ్ సీఐగా రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ రాంబాబు
రాత్రివేళ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ సీఐ మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా మెలగడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి వేకన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపారు. తూర్పుగోదావరి జిల్లా కడియం సీఐ కె.శ్రీధర్‌కుమార్ రాత్రివేళ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా మెలిగినట్టు ఆరోపణలున్నాయి.

ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం నిన్న ఆయనను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిందని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. అప్పటి వరకు ఆయన వీఆర్‌లోనే ఉంటారని పేర్కొన్నారు. అలాగే, రాజమహేంద్రవరం రెండో పట్టణ సీపీఎస్ సీఐ రాంబాబును కడియం ఇన్‌చార్జ్‌ సీఐగా నియమించినట్టు తెలిపారు.
Go Back to Shorts
Kadiam
Andhra Pradesh
Police
CI
VR

More Telugu News