సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి
- బ్యాడ్మింటన్ అకాడమీకి రెండెకరాల భూమి
- గుంటూరు నల్లపాడులో స్థలం కేటాయింపు
- నిన్నటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం
- హర్షం వ్యక్తం చేసిన బ్యాడ్మింటన్ ప్రముఖుడు పున్నయ్య
బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ప్రభుత్వం భూమిని కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పున్నయ్యచౌదరి వెల్లడించారు. ఈ అకాడమీని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు సుధాకర్ రెడ్డి పేరిట ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సుధాకర్ రెడ్డి అర్ధాంగి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సావిత్రి నూతనంగా ఏర్పాటయ్యే ఈ అకాడమీకి సీఈఓగా వ్యవహరిస్తారని వివరించారు.
ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉన్నతస్థాయికి చేర్చవచ్చని పున్నయ్య వివరించారు. ఏపీలో క్రీడల అభివృద్ధి పట్ల సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధాసక్తులు అభినందనీయమని పేర్కొన్నారు.