ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India lost two wickets
  • భారత్ ను దెబ్బకొట్టిన రాబిన్సన్
  • రోహిత్, పుజారా అవుట్
  • 91 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసిన భారత్
  • ఓవరాల్ ఆధిక్యం 164 పరుగులు
నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఓ దశలో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ అనూహ్యంగా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (127), అర్ధసెంచరీ నమోదు చేసిన పుజారా (61)లను ఇంగ్లండ్ బౌలర్ ఓల్లీ రాబిన్స్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు.

ప్రస్తుతం భారత్ స్కోరు 91 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు కాగా, ఓవరాల్ ఆధిక్యం 164కి చేరింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (21 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (5 బ్యాటింగ్) ఉన్నారు.
Go Back to Shorts
Team India
England
Fourth Test
London

More Telugu News