Gorantla Butchaiah Chowdary: ఇంకా ఎన్నాళ్లు భ్ర‌మల్లో ఉంచుతారు?: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

gorantla fires on jagan
  • ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారికి సూటి ప్రశ్న
  • రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు?
  • ఎంత మందికి ఉద్యోగ కల్పన చేశారు?
  • ఈ వివ‌రాలు బహిర్గతం చెయ్యాలి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌ల్లో ఉంచుతూ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. తాను అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

'ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారికి సూటి ప్రశ్న. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో.. ఎంత మందికి ఉద్యోగ కల్పన చేశారో బహిర్గతం చెయ్యాలి. మీరు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటికి మినహాయింపు ఇచ్చి అవి కాకుండా ఎంత మందికి ఇచ్చారు? ఎన్నాళ్లు భ్ర‌మల్లో ఉంచుతారు?' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి నిల‌దీశారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News