రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ భేటీ!
- ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- పలుమార్లు గందరగోళం
- సభ్యుల ఆందోళనలు
- ఘటనలపై చర్చించిన ఓం బిర్లా, వెంకయ్య
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈసారి పెగాసస్ అంశం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం అనైతికంగా నిఘా వేస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టాయి. పెగాసస్ సృష్టికర్త ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. పలు బిల్లులకు సంబంధించిన అంశాలపైనా విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు.