లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.... ఇక్కడా వరుణుడే!
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ
- ఒకే ఒక్క మార్పుతో బరిలోకి భారత్
- ఇంగ్లండ్ జట్టులో మూడు మార్పులు
తుదిజట్ల విషయానికొస్తే... నాటింగ్ హామ్ పిచ్ స్వింగ్ కు అనుకూలిస్తుండడంతో జట్టులోకి తీసుకున్న శార్దూల్ ఠాకూర్ కు రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు. శార్దూల్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఈ టెస్టులోనూ స్థానం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే స్థానంలో హసీబ్ హమీద్, స్టూవర్ట్ బ్రాడ్ స్థానంలో మార్క్ ఉడ్, డాన్ లారెన్స్ స్థానంలో మొయిన్ అలీ వచ్చారు.