ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభకు భారీగా తరలివెళుతున్న ప్రజలు.. వీడియో ఇదిగో
- ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న రేవంత్ రెడ్డి
- లక్ష మందితో దళిత గిరిజన దండోరా సభ
అనంతరం బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు. సుమారు 18 ఎకరాల స్థలంలో లక్ష మంది వచ్చేలా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి సభ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకానికి కౌంటర్గా ఈ సభను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపుతామని కాంగ్రెస్ ప్రకటించింది.