భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి
- చర్ల అటవీప్రాంతంలో కాల్పులు
- మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కూంబింగ్
- పోలీసులకు తారసపడిన మావోలు
- ఓ నక్సల్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
మావోయిస్టు వారోత్సవాలపై పక్కా సమాచారంతో పోలీసులు ఇవాళ తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ షురూ చేశారు. భద్రతా బలగాలను గమనించిన మావోలు కాల్పులు జరిపారు. ఒక మావోయిస్టు మృతదేహం ఘటన స్థలంలో పడివుండడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలదే పైచేయి కావడంతో మావోలు అక్కడ్నించి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్టు సమాచారం.