తెలంగాణలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,15,515 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 71 మందికి కరోనా
- నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
- ఇంకా 9,980 మందికి చికిత్స
అదే సమయంలో 772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,22,313 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 9,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 3,756కి పెరిగింది.
