కేసీఆర్ దళిత ద్రోహి: పొన్నాల లక్ష్మయ్య

KCR deceived dalits says Ponnala Lakshmaiah
  • తెలంగాణ తొలి సీఎం దళితుడే అని చెప్పారు
  • దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని అన్నారు
  • కేబినెట్ లో ఒక్క దళితుడికి కూడా స్థానం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. దళితులకు సంబంధించి జరిగిన అఖిలపక్ష సమావేశానికి తనకు ఇష్టమైన వాళ్లనే పిలిచారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంత వరకు ఏమీ చేయలేదని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్... తన కేబినెట్ లో దళితులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని అన్నారు. కేసీఆర్ వి ప్రకటనలే తప్ప... కార్యాచరణ ఉండదని విమర్శించారు.
Go Back to Shorts
Ponnala Lakshmaiah
Congress
KCR
TRS

More Telugu News