నౌకాయానంలో భారత ప్రాచీన వైభవాన్ని మళ్లీ తేవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విశాఖలో వెంకయ్యనాయుడు పర్యటన
- విశాఖ పోర్టు ట్రస్టులో కార్యక్రమం
- నౌకాయానంలో భారత్ ఒకప్పుడు మేటి అని వెల్లడి
- దేశాభివృద్ధిలో నౌకాశ్రయాలది కీలకపాత్ర అని ఉద్ఘాటన
ఈ సందర్భంగా ఆయనతో పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు సమావేశమయ్యారు. 103 ఎకరాల్లో నిర్మించే ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ గురించి పోర్టు చైర్మన్ వెంకయ్యకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి, విశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.