మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ తెలంగాణ మంత్రుల వినతి
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్సీల బృందం
- రామప్ప ఆలయాన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చాలని వినతి
- మేడారం జాతరకు నిధులు ఇవ్వాలని కోరిన బృందం
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా చారిత్రక సంపదను చాటే రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందజేసింది. అలాగే, రెండేళ్ల కోసారి జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు.