మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సహా పలువురిపై కేసులు
- ‘తీగలమెట్ట’ ఎదురు కాల్పులకు సంబంధించి కేసులు
- ఉపా, ఏపీపీఎస్ చట్టాలు కూడా ప్రయోగం
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారని అభియోగాలు
కేసులు నమోదైన మావోయిస్టు నేతల్లో గణేశ్, అరుణ, జగన్, సుధీర్, ఉదయ్తోపాటు ఇతర మిలీషియా సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తికావడంతో శుక్రవారం రాత్రి అశోక్, రణదేవ్, లలిత మృతదేహాలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మిగతా ముగ్గురి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదని పోలీసులు తెలిపారు.