దసరా బరిలో దిగనున్న 'పుష్ప' రాజ్!

  • ముగింపు దశలో 'పుష్ప'
  • వచ్చేనెలలో షూటింగు పూర్తి
  • బన్నీ తరువాత ప్రాజెక్టు 'ఐకాన్'
  • దర్శకుడిగా వేణు శ్రీరామ్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రూపొందుతోంది. కరోనా తీవ్రత పెరిగే సమయానికి ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇక షూటింగును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా షూటింగును కొనసాగించేందుకు సుకుమార్ చకచకా సన్నాహాలు చేస్తున్నాడట. వచ్చేనెల మొదటివారంలో షూటింగును మొదలుపెట్టి .. నెలాఖరుకి షూటింగు పార్టును కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులంతా పాల్గొంటారట.

'పుష్ప' సినిమాకి సంబంధించిన నిర్మాణానంతర పనులను ఆగస్టు .. సెప్టెంబర్ మాసాల్లో పూర్తిచేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 'పుష్ప' సినిమా తరువాత అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత 'పుష్ప 2' ప్రాజెక్టుపైకి వెళతాడు. 'పుష్ప' రెండు భాగాలుగా రానుండటం .. మొదటి భాగం దసరాకే రానుండటం బన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి.


More Telugu News

Allu Arjun Rashmika Mandanna Aishwarya Rajesh