మోదీ సత్తా ఏపాటిదో చైనాకు తెలిసిపోయిందా?: ఒవైసీ
- సరిహద్దు వెంబడి చైనా స్థావరాల విస్తరణ
- గతంలోనూ ఆందోళన వెలిబుచ్చిన ఒవైసీ
- మరోసారి ప్రధాని లక్ష్యంగా వ్యాఖ్యలు
- 2014లో మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించిన వైనం
"భారత కేంద్ర ప్రభుత్వం గనుక దృఢంగా ఉంటే మన పొరుగు దేశాలు తమ పంథా మార్చుకుంటాయని నరేంద్ర మోదీ 2014లో ప్రధాని కాకముందు వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటికీ చైనా దూకుడు కొనసాగుతూనే ఉంది. మోదీ సత్తా ఏపాటిదో చైనాకు తెలిసిపోయిందా?" అని ఒవైసీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ మేరకు సరిహద్దుల్లో చైనా నిర్మాణాలపై ఓ మీడియా కథనాన్ని కూడా ఒవైసీ పంచుకున్నారు.