అందుకే మిగిలినవాళ్లను గులాబీ పార్టీలోకి సాగనంపుతున్నాడు: విజయసాయిరెడ్డి
- తాజా పరిణామాలపై విజయసాయి స్పందన
- తెలంగాణలో భవిష్యత్తు లేదని బాబుకు అర్థమైందని వెల్లడి
- పలు పార్టీలలోకి నేతలను పంపుతున్నాడని వ్యాఖ్యలు
- అరెస్ట్ భయం నుంచి రక్షణ కోసమేనని ఆరోపణ
ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయిందని, బాబు ఇంకో పదేళ్లు అధికారంలో ఉండుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేదని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఏనాడూ జనరంజక పాలకుడు కాలేకపోయాడని విమర్శించారు. ఎల్లో మీడియా మద్దతుతో కొనసాగాడని, ప్రజలంటే ఎప్పుడూ చిన్నచూపేనని తెలిపారు.
ఉచితంగా కరోనా ఔషధాలు ఇచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు పగబట్టాడని విజయసాయి పేర్కొన్నారు. తన బుట్టలో పడలేదని, సొంతంగా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న అక్కసుతో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నాడని ఆరోపించారు.