నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాకే ఆనందయ్య మందు పంపిణీపై నిర్ణయం: ఆయుష్ కమిషనర్ రాములు
- ఆనందయ్య మందుపై కొనసాగుతున్న అధ్యయనం
- రేపు చివరి నివేదిక వస్తుందన్న రాములు
- సోమవారం హైకోర్టులో విచారణ ఉందని వెల్లడి
- నివేదికలను అధ్యయన కమిటీ పరిశీలిస్తుందని వివరణ
ఇప్పటివరకు వచ్చిన నివేదికలు సానుకూలంగానే వచ్చాయని అన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న చాలామందిని ఫోన్ ద్వారా సంప్రదించామని, వారి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. పంపిణీకి ముందు, ఔషధానికి ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.