తెలంగాణలో కొత్తగా 3,527 మందికి కరోనా పాజిటివ్

Telangana state corona bulletin
  • గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 519 కొత్త కేసులు
  • అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 15 మందికి కరోనా
  • రాష్ట్రంలో 19 మంది కరోనాతో మృతి
తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,527 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519 మంది కొవిడ్ బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215, రంగారెడ్డి జిల్లాలో 207 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకోగా, 19 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,71,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,30,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,793 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,226కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 92.81 శాతానికి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
New Cases
Daily
Today
COVID19

More Telugu News