హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులే: గోవిందానంద సరస్వతి
- హనుమంతుడి జన్మస్థలంపై వివాదం
- ఎటూ తేలని టీటీడీ, హనుమద్ జన్మభూమి ట్రస్టు చర్చలు
- టీటీడీ తీరుపై గోవిందానంద విమర్శలు
- అవగాహన లేకుండా ప్రకటించారని వ్యాఖ్యలు
- 'వేంకటాచల మహత్మ్యం' ఓ తప్పుల తడక అని వెల్లడి
హనుమంతుడి జన్మస్థలానికి ప్రామాణికంగా చూపుతున్న 'వేంకటాచల మహత్మ్యం' సంకలనం ఓ తప్పుల తడక అని అభివర్ణించారు. అది బుర్ర లేని వారు రాసిన పుస్తకం అని గోవిందానంద అన్నారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవడంలేదని ఆయన విమర్శించారు.
త్రేతాయుగంలో తిరుమల పర్వతానికి అంజనాద్రి అని పేరు ఉందని, హనుమంతుడు వెంకటగిరిలో తపస్సు చేసినట్టు రాయడం తప్పు అని పేర్కొన్నారు. హనుమంతుడు కలియుగంలో పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని గోవిందానంద తెలిపారు. టీటీడీ చెబుతున్న దాని ప్రకారం హనుమంతుడు ఓ రాక్షసుడు అని, కానీ రామాయణం ప్రకారం ఓ అప్సరస కుమారుడు అని వివరించారు.