తెలంగాణలో మళ్లీ ఫుడ్ డెలివరీకి అనుమతి!
- తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం
- నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ను అడ్డుకున్న పోలీసులు
- కేటీఆర్ దృష్టికి సమస్య
- కేటీఆర్ చొరవతో మళ్లీ సేవలు ప్రారంభం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలకు ఆయన ఆదేశాలు జారీచేశారు. కాగా, నిన్న హైదరాబాద్లో పలుచోట్ల ఫుడ్ డెలివరీ బాయ్స్ను అడ్డుకోవడంతో ఈ విషయాన్ని వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అత్యవసర రాకపోకలు సాగించే వారిని అడ్డుకోవద్దని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడతానని ట్విట్టర్లో చెప్పారు. దీంతో ఫుడ్ డెలివరీ, ఈ- కామర్స్ సేవలు మళ్లీ ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.