Tarun Tejpal: అత్యాచారం కేసులో తరుణ్ తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటించిన గోవా కోర్టు

తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కు గోవా కోర్టులో ఊరట లభించింది. అత్యాచారం కేసులో ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేసు వివరాల్లోకి వెళ్లే 2013లో గోవాలోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టులో ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారంటూ ఆయన సహచరురాలు కేసు పెట్టింది. దీంతో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

తేజ్ పాల్ పై ఆరోపణలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. తేజ్ పాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, గోవా కోర్టులోనే విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేథ్యంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం కేసును కొట్టేసింది.
Tarun Tejpal
Rape Case
Goa Court
Tehelka

More Telugu News