రఘురామ వైద్య పరీక్షల నివేదికలో జాప్యం... కుటుంబ సభ్యుల ఆందోళన
- ఎంపీ రఘురామ కాలికి గాయాలు
- పోలీసులు కొట్టారంటున్న రఘురామ
- అవి ఎలా తగిలాయన్నదానిపై నిగ్గు తేల్చాలన్న కోర్టు
- గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
- ఆపై రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు
- నివేదిక రూపొందించనున్న మెడికల్ బోర్డు
అయితే, ఈ మధ్యాహ్నం 12 గంటల లోపే రఘురామ వైద్యపరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటివరకు నివేదిక రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం, రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జీజీహెచ్ లోనే ఇంకా పరీక్షలు పూర్తికాకపోవడంతో, రమేశ్ ఆసుపత్రికి ఎప్పుడు తరలిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.