తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరుపుకున్న మున్సిపాలిటీలకు చైర్మన్లు వీరే!
- తెలంగాణలో 5 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు
- టీఆర్ఎస్ హవా
- నేడు చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నిక
- మహిళలకే పెద్ద పీట
సిద్ధిపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్ గా కనకరాజు ఎన్నికయ్యారు. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ గా శెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా లక్ష్మీ రవీందర్, వైస్ చైర్ పర్సన్ గా సారికా రామ్మోహన్ ఎన్నికయ్యారు.