Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు

Case filed on Chandrababu in Kurnool
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదును స్వీకరించిన కర్నూలు వన్ టౌన్ పోలీసులు, చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు, చంద్రబాబు లేని వైరస్ ఉందంటూ విషప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం మండిపడుతున్నారు.
Go Back to Shorts
Chandrababu
Police Case
Kurnool
N440K
Corona Virus

More Telugu News