ఆసుపత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లను చితకబాదిన బంధువులు!
- ఢిల్లీ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన మహిళ
- ఐసీయూలో బెడ్ లేకపోవడంతో మృతి
- దాడిలో గాయపడ్డ డాక్టర్లు, సిబ్బంది
మరోవైపు గాయపడిన సిబ్బంది విధుల్లోకి రావాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లు ఉన్నారని... ప్రస్తుత తరుణంలో వారికి చికిత్స అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపింది.
దాడి జరిగిన గంట తర్వాత ఆసుపత్రికి పోలీసులు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేశారు. విజువల్స్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.