ఏపీలో కరోనా భయానకం... ఒక్కరోజులో 35 మంది మృత్యువాత
- గత 24 గంటల్లో 37,922 కరోనా పరీక్షలు
- 8,987 మందికి పాజిటివ్
- 4 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
- నెల్లూరు జిల్లాలో 8 మంది మృతి
- 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
అదే విధంగా మరణాల్లోనూ మరింత పెరుగుదల నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.