కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్... ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్
- వాంఖెడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్
- పంత్ 51 పరుగులు
- ఉనద్కట్ కు మూడు వికెట్లు
అంతకుముందు, ఓపెనర్లు పృథ్వీ షా (2), శిఖర్ ధావన్ (9), వన్ డౌన్ ఆటగాడు రహానే (8) విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లు లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనద్కట్ ఖాతాలోకి వెళ్లాయి. ఆదుకుంటాడనుకున్న ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ (0) డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కట్ 3, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, క్రిస్ మోరిస్ ఓ వికెట్ తీశారు.