తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షలు
- ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థన
- కొత్త ఏడాదిలో కష్టాలను దాటాలని ఆకాంక్ష
- కరోనాను జయించాలని ప్రార్థన
- మాస్క్లు ధరించాలని సూచన
కరోనా మహమ్మారిని ప్రజలందరూ క్షేమంగా దాటాలని కోరుకున్నారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు. కరోనా విజృంభిస్తోందని గుర్తుచేసిన ఆయన ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.