ఏపీలో కరోనా బీభత్సం... మరోసారి 3 వేలకు పైన కొత్త కేసుల నమోదు
- గత 24 గంటల్లో 33,755 కరోనా పరీక్షలు
- 3,263 మందికి పాజిటివ్
- 11 మంది మృతి
- ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురి కన్నుమూత
- 654 పాజిటివ్ కేసులు
అదే సమయంలో 1,091 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 11 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించగా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, వైఎస్సార్ కడప, కర్నూల్, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,28,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,98,238 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 7,311 మంది కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.