కశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... ముగ్గురు టెర్రరిస్టుల హతం
- షోపియాన్ పట్టణంలో కాల్పులు
- ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు
- ఇంటిని చుట్టుముట్టిన భద్రతా బలగాలు
- మృతుల్లో ఒకరు అగ్రశ్రేణి ఉగ్రవాద కమాండర్
మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు అల్ ఖైదా ప్రభావిత ఉగ్రవాద సంస్థ అన్సర్ ఘజ్వాత్ ఉల్ హింద్ (ఏజీహెచ్) అగ్రశ్రేణి కమాండర్ గా గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో చేతులు కలిపిన ఏజీహెచ్ జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరికొందరు మిలిటెంట్లు ఉన్నారని భావిస్తుండడంతో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని కశ్మీర్ పోలీసు విభాగం వెల్లడించింది.