Corona Virus: తెలంగాణలో కొత్త‌గా 965 కరోనా కేసులు

  Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741
  • మృతుల సంఖ్య 1,706
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 254 మందికి క‌రోనా  
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 965 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 312 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,876 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,706గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 6,159 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,622 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 254 మందికి క‌రోనా సోకింది.

తెలంగాణ‌లో క‌రోనా కేసుల పూర్తి వివ‌రాలు...
 
Corona Virus
COVID19
Telangana

More Telugu News