భారత క్రికెట్ జట్టుకు మహేశ్ బాబు అభినందనలు

Tollywood superstar Mahesh Babu appreciates Team India
  • ఇంగ్లండ్ తో అన్ని ఫార్మాట్లలో విజయం
  • టెస్టు, టీ20, వన్డే సిరీస్ లు కైవసం
  • తిరుగులేని విజయాలంటూ కొనియాడిన మహేశ్ బాబు
  • పూర్తి సాధికారతతో గెలిచారని కితాబు
సొంతగడ్డపై ఇంగ్లండ్ తో అన్ని ఫార్మాట్లలోనూ జయభేరి మోగించిన భారత క్రికెట్ జట్టుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభినందనలు తెలియజేశారు. టెస్టులు, టీ20లు, వన్డేలు.. ఫార్మాట్ ఏదైనా మూడు సిరీస్ ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించారని కితాబునిచ్చారు. 'మీ క్రికెట్ నైపుణ్యానికి మరో తార్కాణం. అసలు సిసలైన సాధికారత కనబర్చారు' అంటూ ప్రశంసించారు.

ఇంగ్లండ్ తో తొలుత 3-1తో టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా ఆపై పరిమిత ఓవర్ల సిరీస్ ల్లోనూ సత్తా చాటింది. 4 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో ఓటమిపాలైన తర్వాత అద్భుత రీతిలో పుంజుకున్న భారత్ వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గింది. ఆపై 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది. అనంతరం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో వశం చేసుకుని మూడు సిరీస్ ల్లోనూ విజేతగా నిలిచింది.
Go Back to Shorts
Mahesh Babu
Team India
Winner
England
Cricket

More Telugu News