Corona Virus: దేశంలో కొన‌సాగుతోన్న క‌రోనా విజృంభ‌ణ‌

India reports 62714 new COVID19 cases
  • 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624
  • మృతుల సంఖ్య 1,61,552
  • 6,02,69,782 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌త 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 28,739 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,23,762 మంది కోలుకున్నారు. 4,86,310 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,02,69,782 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,09,50,842 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,81,289 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Corona Virus
COVID19
India

More Telugu News